Saturday, 29 June 2013
తెలంగాణా పై సానుకూల ప్రకటన వెలువడనుందనే ఉహాగానాలు వినిపిస్తుండడంతో సమైక్యాంద్ర విద్యార్ధి ఐక్య కార్యాచరణ సమితి(ఐకాస) ప్రతినిధులు నిన్న ఆంద్ర విశ్వవిద్యాలయంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని లేదంటే రాష్ట్రంలో అగ్ని గుండాన్ని సృష్టిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశానికి రాష్ట్రానికి చెందిన 12 విశ్వ విద్యాలయాలకు చెందిన ఐకాస ప్రతినిధులు హాజరైయ్యారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలుగు వారి మనోభావలకు వ్యతిరేకంగా తెలంగాణా ఇవ్వాలనుకుంటే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని అన్నారు. అలాగే రాష్ట్రం సమైక్యంగానే ఉంచుతామని స్పష్టమైన ప్రకటన చేయాలని వారు కోరారు. ఈ నెల 30న రాష్ట్రాన్ని సమక్యంగానే ఉంచాలని కోరుతూ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ ను కలువనున్నట్లు వారు తెలియజేశారు. ఈ సమావేశంలో నాగార్జున విశ్వవిద్యాలయం, ఆంద్ర విశ్వవిద్యాలయంతో పాటు మరి కొన్ని విశ్వవిద్యాలయాల విద్యార్ధి ఐకాస ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags: News, Telugu News, Andhra News 

Templateify

Sed ut perspiciatis unde omnis iste natus error sit voluptatem accusantium doloremque laudantium, totam rem aperiam, eaque ipsa quae abtore veritatis et quasi architecto beatae vitae dicta sunt explicabo. Nemo enim ipsam voluptatem quia voluptas sit aspernatur aut odit aut fugit

0 comments