Wednesday, 26 June 2013


రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలలేదన్నట్లు.. వరద బాధితులను రక్షించడానికి వెళ్లిన రాష్ట్ర నేతలు డెహ్రడూన్లో కూడా కొట్టుకున్నారు. రాష్ట్ర పరువును గంగలో కలిపారు. తెలుగువారిని స్వస్థలాలకు తరలించేందుకు ప్రభుత్వ విమానంతోపాటు తెలుగుదేశం పార్టీ కూడా ఓ విమానాన్ని ఏర్పాటుచేసింది. 

అయితే తెలుగుదేశం ఏర్పాటు చేసిన విమానం ఎక్కుతున్న బాధితులను కాంగ్రెస్ పార్టీవాళ్లు అడ్డుకొని ప్రభుత్వ విమానం ఎక్కించారని తెదేపా సభ్యులు అడగడంతో వివాదం మొదలైంది. 
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, తెలుగుదేశం నాయకుడు రమేష్ రాథోడ్ ఈ ఘటనలో ఒకర్నొకరు తోసుకోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడమే కాకుండా పరుషపదజాలంతో దూషించుకోవడంతో బాధితులంతా అలానే చూస్తుండిపోయారు. 

చార్ ధామ్ యాత్రలో అష్టకష్టాలు పడి డెహ్రాడూన్ వస్తే.. ఈ రాజకీయ నేతల తలనొప్పి ఏంటిరా బాబూ అంటూ తలపట్టుకుంటున్నారు.

Tags: News, Telugu News, Andhra News

Templateify

Sed ut perspiciatis unde omnis iste natus error sit voluptatem accusantium doloremque laudantium, totam rem aperiam, eaque ipsa quae abtore veritatis et quasi architecto beatae vitae dicta sunt explicabo. Nemo enim ipsam voluptatem quia voluptas sit aspernatur aut odit aut fugit

0 comments