Monday, 17 June 2013
Kavuri Sambasiva Rao


ఎట్టకేలకు మంత్రి  పదవి దక్కించుకున్న కావూరి !

 ఆంధ్ర సమైక్య వాదిగా నిలిచిన MP కావూరి సాంబశివరావు కు కాబినెట్ హోదాలో జావళి శాఖా మంత్రి పదవి దక్కింది . అయన గత కొద్ది కాలంగా కాంగ్రెస్ అధిష్టానం మీద అలిగి, పార్టికి కొంచెం దూరంగా ఉంటూ వచ్చారు . 
3 దశాబ్దాల కు ఫైగా పార్టీలో ఉన్న తనకు తగిన గుర్తింపు రాలేదని , త్వరలో తన రాజకీయ భవిషత్ వెల్లడి చేస్తాన్నని ప్రకటన కూడా చేసారు . ఆ తరువాత స్వయంగా ప్రధాని మన్మోహన్ , మన ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు నచ్చ చెప్పిన మీదట పార్టీ ని వీడకుండా మౌనంగా ఉండిపోయారు . రాష్ట్రం తరపున కేంద్రంలో గట్టిగా సమైఖ్య వాదం వినిపించిన వారిలో కావూరి ముఖ్యుడు . జౌళిశాఖ సాధారణ ప్రజానీకంతో ముడిపడి ఉంది అని, జౌళిశాఖకు ప్రపంచస్థాయిలో అభివృద్ధి చేసేందుకు, గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తా అని కావూరి అన్నారు. రాష్ట్ర చేనేత కార్మికుల ఆత్మహత్యల నిరోధానికి, పత్తిరైతుల సమస్యలు పరిష్కరిస్తానని కావూరి స్పష్టం చేశారు. 


Tags: News, AP News, Andhra News, Telugu News  

Templateify

Sed ut perspiciatis unde omnis iste natus error sit voluptatem accusantium doloremque laudantium, totam rem aperiam, eaque ipsa quae abtore veritatis et quasi architecto beatae vitae dicta sunt explicabo. Nemo enim ipsam voluptatem quia voluptas sit aspernatur aut odit aut fugit

0 comments