Saturday, 8 June 2013




15 మంది MLA ల ఫై అనర్హత వేటు !


ఇటీవల రాష్ట్ర అసంబ్లీ లో ప్రభుత్వం ఫై పెట్టిన అవిస్వాస తీర్మానం లో, తమ పార్టీలు జారీ చేసిన విప్ దిక్కరించి , స్వప్రయోజనాలకు లొంగి, తమ పార్టీల కు వ్యతిరేకంగా ఓటేసిన వారిలో, 15 మంది MLA లఫై స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఈ రోజు అనర్హత వేటు వేసారు . విప్ ను ధిక్కరించిన తమ MLA ల ఫై ఆ యా పార్టీలు స్పీకర్ కు ఫిర్యాదు చేయగా , సుమారు రెండు నెలలు విచారణ జరిపి MLA ల నుంచి వివరణ తీసుకున్న తరువాత ఆయన  ఈ నిర్ణయం తీసుకున్నారు . 

వీరిలో అనర్హులుగా ప్రకటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు: బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి - దర్శి , మద్దాల రాజేష్ - చింతలపూడి ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి -కాకినాడ, గొట్టిపాటి రవి- అద్దంకి, సుజయ కృష్ణ రంగారావు - బొబ్బిలి , పేర్ని నాని - మచిలీపట్నం, ఆళ్ల నాని - ఏలూరు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి - పుంగనూరు, జోగి రమేష్ - పెడన

అనర్హులుగా ప్రకటించిన టిడిపి ఎమ్మెల్యేలు: ప్రవీణ్ కుమార్ రెడ్డి - తంబళ్లపల్లి, కొడాలి నాని - గుడివాడ
తానేటి వనిత - గోపాలపురం, అమర్ నాథ్ రెడ్డి - పలమనేరు, వై.బాలనాగిరెడ్డి - మంత్రాలయం
సాయిరాజ్ - ఇచ్చాపురం ఉన్నారు .  వీరు కాక మరో నలుగురి ఫై సభా పతి  నిర్ణయం తీసుకో వలసి ఉంది . వారిలో 
MLA లు వేణుగోపాలచారి, రామకోటయ్య, హరీశ్వరరెడ్డి , గంగుల కమలాకర్  లు ఉన్నారు .   

Tags: News, Telugu News,  


Templateify

Sed ut perspiciatis unde omnis iste natus error sit voluptatem accusantium doloremque laudantium, totam rem aperiam, eaque ipsa quae abtore veritatis et quasi architecto beatae vitae dicta sunt explicabo. Nemo enim ipsam voluptatem quia voluptas sit aspernatur aut odit aut fugit

0 comments